Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు అప్పులు, ఇంటికి దెయ్యం పట్టిందని నిమ్మకాయ కోసి 10 తులాల బంగారంతో పరార్

ఐవీఆర్
శుక్రవారం, 8 మార్చి 2024 (12:27 IST)
అప్పులు ఎవరికి వుండవు. ఏ మనిషిని కదిలించినా తనకు పుట్టెడు అప్పులు వున్నాయని చెపుతారు. ఐతే కొందరు చేసిన అప్పులు ఎందుకు అయ్యాయా అనే విషయాన్ని పక్కన పడేసి, మూఢ విశ్వాసాలను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోని ఫిలిమ్ నగరంలో చోటుచేసుకున్నది. ఇంట్లో అశాంతి, అప్పులు తదితర సమస్యలున్నాయని ఓ మహిళ చెప్పింది.
 
ఈ మాటలను విన్న మాయగాళ్లు ఆమె ఇంటికి వచ్చేసారు. ఇంటికి దెయ్యం పట్టిందనీ, అందువల్లనే ఇంట్లో అశాంతి, అప్పులు ప్రారంభమయ్యాయనీ, పూజ చేస్తే వదిలిపోతుందని నమ్మించారు. పూజలో బంగారు వస్తువులు వుంచాలని చెప్పడంతో ఆమె 10 తులాల బంగారాన్ని పెట్టేసింది. దాంతో సదరు దుండగులు మహిళను కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తుండాలని చెప్పారు. ఆమె కళ్లు మూసుకుని ప్రార్థిస్తుండగా బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీనితో తను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments