Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు అప్పులు, ఇంటికి దెయ్యం పట్టిందని నిమ్మకాయ కోసి 10 తులాల బంగారంతో పరార్

ఐవీఆర్
శుక్రవారం, 8 మార్చి 2024 (12:27 IST)
అప్పులు ఎవరికి వుండవు. ఏ మనిషిని కదిలించినా తనకు పుట్టెడు అప్పులు వున్నాయని చెపుతారు. ఐతే కొందరు చేసిన అప్పులు ఎందుకు అయ్యాయా అనే విషయాన్ని పక్కన పడేసి, మూఢ విశ్వాసాలను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోని ఫిలిమ్ నగరంలో చోటుచేసుకున్నది. ఇంట్లో అశాంతి, అప్పులు తదితర సమస్యలున్నాయని ఓ మహిళ చెప్పింది.
 
ఈ మాటలను విన్న మాయగాళ్లు ఆమె ఇంటికి వచ్చేసారు. ఇంటికి దెయ్యం పట్టిందనీ, అందువల్లనే ఇంట్లో అశాంతి, అప్పులు ప్రారంభమయ్యాయనీ, పూజ చేస్తే వదిలిపోతుందని నమ్మించారు. పూజలో బంగారు వస్తువులు వుంచాలని చెప్పడంతో ఆమె 10 తులాల బంగారాన్ని పెట్టేసింది. దాంతో సదరు దుండగులు మహిళను కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తుండాలని చెప్పారు. ఆమె కళ్లు మూసుకుని ప్రార్థిస్తుండగా బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీనితో తను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మార్పు రావాలి : కౌశిక్, విజయ్ రెడ్డి పిలుపు

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments