Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు అప్పులు, ఇంటికి దెయ్యం పట్టిందని నిమ్మకాయ కోసి 10 తులాల బంగారంతో పరార్

ఐవీఆర్
శుక్రవారం, 8 మార్చి 2024 (12:27 IST)
అప్పులు ఎవరికి వుండవు. ఏ మనిషిని కదిలించినా తనకు పుట్టెడు అప్పులు వున్నాయని చెపుతారు. ఐతే కొందరు చేసిన అప్పులు ఎందుకు అయ్యాయా అనే విషయాన్ని పక్కన పడేసి, మూఢ విశ్వాసాలను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోని ఫిలిమ్ నగరంలో చోటుచేసుకున్నది. ఇంట్లో అశాంతి, అప్పులు తదితర సమస్యలున్నాయని ఓ మహిళ చెప్పింది.
 
ఈ మాటలను విన్న మాయగాళ్లు ఆమె ఇంటికి వచ్చేసారు. ఇంటికి దెయ్యం పట్టిందనీ, అందువల్లనే ఇంట్లో అశాంతి, అప్పులు ప్రారంభమయ్యాయనీ, పూజ చేస్తే వదిలిపోతుందని నమ్మించారు. పూజలో బంగారు వస్తువులు వుంచాలని చెప్పడంతో ఆమె 10 తులాల బంగారాన్ని పెట్టేసింది. దాంతో సదరు దుండగులు మహిళను కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తుండాలని చెప్పారు. ఆమె కళ్లు మూసుకుని ప్రార్థిస్తుండగా బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీనితో తను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వయసుతో సమంబంధం లేదు - ప్రతి ఒక్కరూ బానిసలవుతున్నారు : ఐశ్వర్య రాయ్

Faria Abdullah: సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ గుర్రం పాపిరెడ్డి సాంగ్

'గ్రాజియా ఇండియా' కవర్ పేజీపై సమంత!

Anupama: ప్రతి ఒక్కరి పరదా వెనుక మరో వ్యక్తి వుంటాడు : నిర్మాత విజయ్ డొంకడ

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments