Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండెక్టర్

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (16:25 IST)
గద్వాల్-వనపర్తి మార్గంలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆ గర్భిణికి మహిళా కండక్టర్, నర్సు సహాయంతో పురుడు పోసింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
 
సోమవారం ఉదయం గద్వాలకు చెందిన సంధ్య అనే గర్భిణి పల్లె వెలుగు బస్సులో రక్షా బంధన్ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహళ్లికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి.
 
మహిళా కండక్టర్ జి భారతి వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేసి బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సుతో పాటు కండక్టర్ గర్భిణిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. ఈ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్‌ సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. సకాలంలో స్పందించిన మహిళా కండక్టర్‌ను యాజమాన్యం తరపున టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments