Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండెక్టర్

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (16:25 IST)
గద్వాల్-వనపర్తి మార్గంలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆ గర్భిణికి మహిళా కండక్టర్, నర్సు సహాయంతో పురుడు పోసింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
 
సోమవారం ఉదయం గద్వాలకు చెందిన సంధ్య అనే గర్భిణి పల్లె వెలుగు బస్సులో రక్షా బంధన్ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహళ్లికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి.
 
మహిళా కండక్టర్ జి భారతి వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేసి బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సుతో పాటు కండక్టర్ గర్భిణిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. ఈ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్‌ సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. సకాలంలో స్పందించిన మహిళా కండక్టర్‌ను యాజమాన్యం తరపున టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments