Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్సీ గుడ్‌పై!!

వరుణ్
ఆదివారం, 24 మార్చి 2024 (11:32 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి షాకులపై షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు పార్టీని వీడి అధికార కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు. తాజాగా మరో నేత, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి షాకిచ్చారు. ఆయన బీఆర్ఎస్‌కు టాటా చెప్పేశారు. తన రాజీనామా లేఖను ఈ నెల 18వ తేదీనే పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ఈ విషయాన్ని నల్గొండ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డిని పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ లేఖను ఆయన బహిర్గతం చేశారు. పైగా, ఈయన బీజేపీలో చేరి.. అదే నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది. తన రాజకీయ భవిష్యత్‌ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన అధికారికంగా వెల్లడించారు. 
 
చిన్నపరెడ్డి నల్గొండ స్థానాన్ని ఆశించారు. కానీ, మాజీ సీఎం కేసీఆర్ ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా కంచర్ల కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఆ వెంటనే ఆయన తన రాజీనామా లేఖను బహిర్గతం చేశారు. అదేసమయంలో చిన్నపరెడ్డికి బీజేపీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. ఆయనకు నల్గొండ ఎంపీ స్థానాన్ని కేటాయించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని కమలం పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇపుడు ఆ స్థానాన్ని చిన్నపరెడ్డి కేటాయించి, సైదిరెడ్డికి మరో స్థానం కేటాయించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ హామీతోనే చిన్నపరెడ్డి బీజేపీ‌ను వీడినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చిన్నపరెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments