Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల మధ్య కొట్లాట.. డిగ్రీ సెకండియర్ విద్యార్థి హత్య.. ఎలా జరిగిందంటే?

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (09:52 IST)
కొత్తగూడెం జిల్లాలో విద్యార్థుల మధ్య కొట్లాట ఓ యువకుడిని బలితీసుకుంది. జిల్లాలోని పలోంచ మండలం ఇందిరానగర్ కాలనీలో శనివారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కొందరు డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కొట్టి చంపేశారు. 
 
మృతుడు యానంబైలు గ్రామానికి చెందిన అల్లూరి విష్ణు(21) మండలంలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో చదువుతూ ఖాళీ సమయాల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. అదే కాలేజీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులతో వున్న గొడవలే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు చెప్తున్నారు.
 
శుక్రవారం సాయంత్రం ఇంటర్మీడియట్ విద్యార్థులు విష్ణు, అతని స్నేహితులతో గొడవ పడ్డారు. విషయాన్ని కళాశాల అధ్యాపకుడి వద్దకు తీసుకెళ్లగా ఆయన వారిని శాంతింపజేసే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాలు అక్కడ నుంచి వెళ్లిపోయాయి.
 
కానీ ఇంతటితో ఈ గొడవకు తెరపడలేదు. కళాశాల సమీపంలో రోడ్డుపై నిల్చున్న విష్ణుపై ఇంటర్మీడియట్ విద్యార్థులు దాడి చేశారు. ఆటో రిక్షాలో అటుగా వెళ్తున్న విష్ణు బంధువులు గమనించి అతడిని రక్షించేందుకు ముందుకొచ్చారు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విష్ణును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పాలోంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిలో ఐదుగురిని గుర్తించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments