Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డ చాతిలో పొడిచిన తల్లిదండ్రులు!!

knife

సెల్వి

, శనివారం, 27 జులై 2024 (08:59 IST)
గుడుంబా, గంజాయి మత్తులో అనేక పలు నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డను ఛాతిలో పొడించారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా నన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన అబ్బర్ల విజయ్, పద్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ దంపతులతో పాటు మరో ఇద్దరు కుమారులు నిత్యం గుడుంబా మత్తులో ఉంటూ పొద్దస్తమానం గొడవలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజయ్, పద్మలు తమ రెండో కుమారుడు అశోక్‌ను గుడుంబా కోసం డబ్బులు అడగ్గా అతను నిరాకరించాడు. 
 
దీంతో కోపం పెంచుకున్న ఆ దంపతులు.. గుడుంబా తాగి... ఆ మత్తులో ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న పెద్ద కుమారుడు శేఖర్‌ను అశోక్ అనుకుని కొడవలితో ఛాతిపై పొడిచారు. దీంతో తీవ్రంగా గాయపడిన శేఖర్.. మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చోరీకి వచ్చిన దొంగ.. ఇంట్లో ఏమీ లేకపోవడంతో రూ.20 పెట్టి వెళ్ళిపోయాడు.. (Video)