Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణు స్వామికి షాకిచ్చిన తెలంగాణ మహిళా కమిషన్!!

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (09:36 IST)
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి, సినీ నటులు, రాజకీయ నాయకుల జాతకాలు వెల్లడించడం ద్వారా గత కొన్నాళ్లుగా బాగా పాపులర్ అయ్యాడు. అయితే, ఆయన ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్లలపై కామెంట్స్ చేశారు. వీరిద్దరి జాతకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయన పెను వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 
వేణు స్వామి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద, వేణు స్వామి ఈ నెల 22వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. 
 
ఇది మొదటిసారి కాకపోయినా, గతంలో కూడా వేణు స్వామి పలువురు టాలీవుడ్ స్టార్ల కెరీర్, వివాహాలు, అలాగే, రాజకీయ ఫలితాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసిన జోస్యం తప్పడంతో అప్పట్లో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత, చైతన్య - శోభిత వివాహ నిశ్చితార్థంపై వ్యాఖ్యలు చేయడం మరోసారి వివాదాస్పదం అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments