Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణు స్వామికి షాకిచ్చిన తెలంగాణ మహిళా కమిషన్!!

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (09:36 IST)
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి, సినీ నటులు, రాజకీయ నాయకుల జాతకాలు వెల్లడించడం ద్వారా గత కొన్నాళ్లుగా బాగా పాపులర్ అయ్యాడు. అయితే, ఆయన ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్లలపై కామెంట్స్ చేశారు. వీరిద్దరి జాతకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయన పెను వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 
వేణు స్వామి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద, వేణు స్వామి ఈ నెల 22వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. 
 
ఇది మొదటిసారి కాకపోయినా, గతంలో కూడా వేణు స్వామి పలువురు టాలీవుడ్ స్టార్ల కెరీర్, వివాహాలు, అలాగే, రాజకీయ ఫలితాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసిన జోస్యం తప్పడంతో అప్పట్లో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత, చైతన్య - శోభిత వివాహ నిశ్చితార్థంపై వ్యాఖ్యలు చేయడం మరోసారి వివాదాస్పదం అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments