కేటీఆర్ బావమరిదిని తొమ్మిది గంటలు ప్రశ్నించిన పోలీసులు

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (11:07 IST)
Raj pakala
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బావమరిది, జన్వాడ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుడు నెం.1 అయిన రాజ్ పాకాలకి బీఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు అందాయి. నార్సింగి డివిజన్ ఏసీపీ రమణ గౌడ్ నేతృత్వంలో మోకిల, నార్సింగి పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ జరిపిన అనంతరం ఈ నోటీసులు జారీ చేశారు. విచారణలో ఎన్నారై విజయ్ మద్దూరి వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వచ్చాయి.
 
పోలీసులు ప్రధాన నిందితుడిని జన్వాడ ఫామ్‌హౌస్‌కి, విజయ్ మద్దూరి మొబైల్ ఫోన్‌కు సంబంధించి సోదాల కోసం తీసుకెళ్లారు. సుమారు గంట పాటు ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్ వినియోగించి దొరికిపోయిన విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది. కాగా, దాడి సమయంలో కొకైన్‌కు పాజిటివ్‌గా తేలిన విజయ్ మద్దూరి ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. 
 
అయితే విచారణ అనంతరం మోకిల పోలీస్ స్టేషన్ నుంచి రాజ్ పాకాల బయటకు వచ్చారు. తాను పోలీసులకు పూర్తిగా సహకరించానని ఆయన మీడియాకు తెలిపారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ తాను సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని, విజయ్ మద్దూరి పోలీసులకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని ఆయన మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments