22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఠాగూర్
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (17:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరైన ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరువుతారని పేర్కొన్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ నంబరును ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments