Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఠాగూర్
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (17:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరైన ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరువుతారని పేర్కొన్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ నంబరును ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments