Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

సెల్వి
గురువారం, 16 మే 2024 (10:27 IST)
ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీకి నిధులు సమీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ బుధవారం అధికారులను ఆదేశించారు.
 
రాష్ట్రంలోని 2 లక్షల మంది రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.32,000 కోట్లు అవసరం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాన్ని చేసింది. కానీ ఆ పార్టీ మేనిఫెస్టోలో అమలు తేదీని పేర్కొనలేదు. 
 
లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా, సీఎం గడువును ఆగస్టు 15గా ప్రకటించారు. "పంట రుణాల మాఫీని అమలు చేయడానికి సరైన విధానాలతో కార్యాచరణ ప్రణాళికతో రండి." అంటూ అధికారులను సీఎం ఆదేశించారు. 
 
ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో ఇప్పటికే వివరాలు ప్రకటించారు. ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. 
 
ఏప్రిల్‌ 1, 2019 నుంచి డిసెంబరు 10, 2023 మధ్య రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న, రెన్యువల్‌ చేసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments