Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరిజిన్ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి (Video)

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (11:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరిజిన్ డైరీ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి జరిపారు. 
 
పట్టణంలోని రామటాకీస్ వీధిలో ఓ బార్బర్ షాపు వద్ద ఆదివారం రాత్రి ఆదినారాయణ మరో వ్యక్తితో కలిసివున్నాడు. ఆ సమయంలో భారాస నేతలు కొందరు వచ్చి ఆదినారాయణ నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి మరీ ఈ దాడికి పాల్పడ్డారు. దండం పెట్టి వేడుకున్నా కనికరించకుండా విచక్షణారహితంగా చితకబాదారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఆదినారాయణ ఆరోపిస్తున్నారు. దీంతో దుర్గం చిన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ దాడిలో ఆదినారాయణకు గాయాలయ్యాయి. దీంతో ఆయన వెంట ఉన్న వ్యక్తి ఆదినారాయణను హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆదినారాయణకు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ఈ దాడికి గల కారణాలు తెలియాల్సివుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments