Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరిజిన్ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి (Video)

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (11:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరిజిన్ డైరీ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి జరిపారు. 
 
పట్టణంలోని రామటాకీస్ వీధిలో ఓ బార్బర్ షాపు వద్ద ఆదివారం రాత్రి ఆదినారాయణ మరో వ్యక్తితో కలిసివున్నాడు. ఆ సమయంలో భారాస నేతలు కొందరు వచ్చి ఆదినారాయణ నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి మరీ ఈ దాడికి పాల్పడ్డారు. దండం పెట్టి వేడుకున్నా కనికరించకుండా విచక్షణారహితంగా చితకబాదారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఆదినారాయణ ఆరోపిస్తున్నారు. దీంతో దుర్గం చిన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ దాడిలో ఆదినారాయణకు గాయాలయ్యాయి. దీంతో ఆయన వెంట ఉన్న వ్యక్తి ఆదినారాయణను హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆదినారాయణకు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ఈ దాడికి గల కారణాలు తెలియాల్సివుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments