రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

ఐవీఆర్
మంగళవారం, 1 జులై 2025 (12:58 IST)
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కుమార్తెకు వైద్యం చేయించలేక ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన పరశురాంకి ఒక కొడుకు-కూతురు వున్నారు.
 
రెండేళ్ల క్రితం పరశురాం కొడుకు సందీప్, కుమార్తె సింధు ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె సింధు కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకి గత రెండేళ్లుగా దాతల సాయంతో రూ. 30 లక్షల ఖర్చుతో చికిత్స చేయిస్తూ వచ్చాడు. ఐతే కుమార్తె ఆరోగ్య పరిస్థితి ఎంతమాత్రం మెరుగుపడలేదు.
 
ఆమెకి చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురై మనస్థాపం చెందాడు. కన్నకుమార్తెకి వైద్యం చేయించలేని స్థితికి మనోవేదన చెంది ఆదివారం రాత్రి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు పరశురాం. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments