Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Anchor Swetcha: యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి.. పూర్ణచందర్ భార్య ఏమంటుందంటే?

Advertiesment
Anchor Swetcha

సెల్వి

, సోమవారం, 30 జూన్ 2025 (11:06 IST)
Anchor Swetcha
ప్రముఖ టీవీ చానల్‌ న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు.  అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు. 
 
పూర్ణ చందర్‌ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్నారు. అయితే, వారిద్దరి మధ్య సంబంధం గురించి ముందు తనకు తెలియదన్నారు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని పేర్కొన్నారు. "నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బయపెట్టిందని స్వప్న వివరించారు. నా భర్త పూర్ణచందర్‌ నిర్దోషి, అమాయకుడని" స్వప్న సంచలన చేశారు.
 
పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అరణ్యను పూర్ణచందర్‌ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ తనను మానసికంగా టార్చర్‌ చేసిందని, స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిందని స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు.
 
కాగా, స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్‌ను పోలీసులు నిన్న అరెస్ట్‌ చేశారు. అతడి వేధింపుల కారణంగానే తమ కూతురు స్వేచ్ఛ మరణించినట్టు చిక్కడపల్లి పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
"మా అమ్మ ముందు నన్ను బాగా చూసుకున్నట్టు యాక్టింగ్ చేసేవాడు.. నాతో మాత్రం అసభ్యంగా ప్రవర్తించేవాడు. నన్ను అమ్మను పక్క పక్కన కూర్చోనివ్వడు.. తప్పుడు మాటలతో చాలా ఇబ్బందిపెట్టేవాడు. పూర్ణ చందర్ నిజస్వరూపాన్ని యాంకర్ స్వేచ్ఛ కూతురు బయటపెట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు నాన్న.. వాట్సాప్ మెసేజ్.. ఆపై పురుగుల మందు తాగి?