శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

ఐవీఆర్
బుధవారం, 25 జూన్ 2025 (21:47 IST)
సికింద్రాబాద్: శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
 
ఈ వైభోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ ట్రస్టీ శ్రీ పురుషోత్తం మలాని మాట్లాడుతూ.., “జగన్నాథుడి వార్షిక రథోత్సవాన్ని, సంబంధిత వేడుకలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. సికింద్రాబాద్- హైదరాబాద్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో భగవంతుని ఆశీస్సులు పొందుతారని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. ఈ రథయాత్ర నేపథ్యంలో పేర్కొన్న సమయాలను గమనించి, తదనుగుణంగా దర్శనం ప్లాన్ చేసుకోవాలని ఆయన అందరినీ అభ్యర్థించారు.
 
ఈ నేపథ్యంలో దర్శనం కోసం ఆలయ ద్వారాలు ఉదయం 6:15 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడతాయి. ఆ తర్వాత, రథయాత్ర ఊరేగింపు సాయంత్రం 4:00 గంటలకు ఆలయం నుండి ప్రారంభమై జనరల్ బజార్ నుండి కొనసాగి, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:00 వరకు ఎంజి రోడ్‌కి చేరుకుంటుంది. ఆ తర్వాత రాణిగంజ్‌లోని హిల్ స్ట్రీట్ నుండి వెళ్లి మరుసటి రోజు ఉదయం 4:00 గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments