Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

ఐవీఆర్
బుధవారం, 25 జూన్ 2025 (21:47 IST)
సికింద్రాబాద్: శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
 
ఈ వైభోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ ట్రస్టీ శ్రీ పురుషోత్తం మలాని మాట్లాడుతూ.., “జగన్నాథుడి వార్షిక రథోత్సవాన్ని, సంబంధిత వేడుకలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. సికింద్రాబాద్- హైదరాబాద్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో భగవంతుని ఆశీస్సులు పొందుతారని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. ఈ రథయాత్ర నేపథ్యంలో పేర్కొన్న సమయాలను గమనించి, తదనుగుణంగా దర్శనం ప్లాన్ చేసుకోవాలని ఆయన అందరినీ అభ్యర్థించారు.
 
ఈ నేపథ్యంలో దర్శనం కోసం ఆలయ ద్వారాలు ఉదయం 6:15 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడతాయి. ఆ తర్వాత, రథయాత్ర ఊరేగింపు సాయంత్రం 4:00 గంటలకు ఆలయం నుండి ప్రారంభమై జనరల్ బజార్ నుండి కొనసాగి, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:00 వరకు ఎంజి రోడ్‌కి చేరుకుంటుంది. ఆ తర్వాత రాణిగంజ్‌లోని హిల్ స్ట్రీట్ నుండి వెళ్లి మరుసటి రోజు ఉదయం 4:00 గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments