తెలంగాణాలో భారీ వర్షాలు... పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (10:24 IST)
తెలంగాణాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కరీం నగర్, జగిత్యాల యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ అధికారులు గురువారం సెలవు ప్రకటించారు. ముఖ్యంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 
 
యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిగా వచ్చే నెల రెండో శనివారం పాఠశాలల పనిదినంగా అధికారులు ప్రకటించారు. మరోవైపు, యాదాద్రి జిల్లాలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
భారీ వర్షాలు, వరదలతో ప్రజలకు ఇబ్బందులు కలగడంపై భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలలతో ఆయన ఫోనులో మాట్లాడి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని కేటీఆర్‌ను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ARi: అరి చిత్రంలో భగవద్గీత సారాన్ని చెప్పా : దర్శకుడు వి. జయశంకర్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

Raj Tarun: ఈసారి చిరంజీవి ని నమ్ముకున్న రాజ్ తరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments