Sandhya Theatre Stampede: పుష్ప-2.. సంధ్య థియేటర్ తొక్కిసలాట- శ్రీతేజ్ బ్రెయిన్ సమస్యలా?

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (10:58 IST)
హైదరాబాద్‌లో అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో బాధితురాలైన మృతురాలి కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
హైదరాబాద్‌లోని కిమ్స్ కడిల్స్ హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, తొక్కిసలాటలో ఎనిమిదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నారు. అతని నాడీ సంబంధిత పరిస్థితి కూడా మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు.
 
చిన్నారికి చికిత్స చేస్తున్న వైద్య బృందం కూడా వైద్యులు అతని శ్వాస తీసుకోవడంలో సహాయపడటానికి, వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టమీని పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.
 
తొక్కిసలాట కేసు దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్, ఆ చిన్నారి "బ్రెయిన్ సమస్యలు" అని మీడియాకు చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ ఆర్టీసీ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన పుష్ప 2 ప్రీమియర్ షోకు రేవతి, ఆమె భర్త భాస్కర్ పిల్లలు శ్రీ తేజ్ సాన్విక (7) హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments