Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి తాళాలను పగులగొట్టి రూ.2 కోట్ల నగదు దోపిడీ..

ఠాగూర్
ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (11:08 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. మక్త గ్రామంలోని నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో రూ.2 కోట్ల నగదును దుండగులు చోరీచేశారు. ఇంటి తాళాలలను పగులగొట్టి బీరువాలో ఉంచిన నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు.
 
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ప్రకారం.. నాగభూషణం ఇటీవల శంకర్‌పల్లిలో 10 ఎకరాల భూమి విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు. కొనుగోలుదారులు అడ్వాన్స్‌గా రూ.2 కోట్ల 2 లక్షల నగదు ఇవ్వడంతో ఇంట్లో ఉంచారు. ఆ నగదుతో పాటు 28 తులాల బంగారు నగలును దొంగలు ఎత్తుకెళ్లారు. నాగభూషణం వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments