Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను రూ. 100 కోట్లు అడిగిన రేవంత్ రెడ్డి.. కౌంటరిచ్చిన కేసీఆర్

సెల్వి
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:04 IST)
సాగునీటి కొరతతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇటీవల మండిపడ్డారు. ఈ దుస్థితిలో రైతుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
 
ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట ప్రస్తావించగా.."కేసీఆర్‌ తన ఎలక్టోరల్‌ బాండ్‌ నిధుల నుంచి ఇతర కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయలను ఇవ్వవచ్చు. అప్పుడు ఆయన కోరిన నష్టపరిహారాన్ని సంతోషంగా పంపిణీ చేస్తాం.." అంటూ రేవంత్ చాకచక్యంగా దాటవేశారు. 
 
అయితే ఈరోజు మీడియాతో రేవంత్‌ చేసిన ప్రత్యారోపణపై కేసీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. "ప్రత్యర్థి పార్టీ నుంచి సీఎం రూ.100 కోట్లు అడగడం తమాషాగా ఉంది. చేతకాని పక్షంలో సీఎం పదవి నుంచి వైదొలగాలి. ఆ తర్వాత రైతులకు నష్టపరిహారం ఎలా ఇస్తారో చూసి సీఎం పని నేర్చుకోమన్నారు.
 
చివరకు బీఆర్‌ఎస్‌ ఎన్నికల నిధి నుంచి సీఎం రేవంత్‌ రూ. 100 కోట్లు అడగడం, దానికి ప్రతిఫలంగా కేసీఆర్‌ సీఎం పదవి ఇవ్వాలని కోరడంతో రైతు పరిహారంపై వాడివేడి చర్చ ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments