Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమెంట్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. పల్టీలు కొట్టింది.. ముగ్గురు మృతి- 20మందికి గాయాలు

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (11:36 IST)
Accident
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లాలో సిమెంట్ లారీని ట్రావెల్స్ బ‌స్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందగా.. 8 మందికి తీవ్ర గాయాలైనాయి. 
 
ఏలూరు సమీపంలో సోమవరప్పాడు - చొదిమెళ్ళ వద్ద ఆగివున్న లారీని వెంకట రమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఇంకా అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. 
 
ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు నంబర్ NL 01 B 3092గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments