Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (17:59 IST)
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిరావు పూలె ప్రజాభవన్‌గా మార్చిన విషయం తెల్సిందే. ఇదే భవనంలోనే ప్రజాదర్బార్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ఇపుడు ఈ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం మల్లు భట్టివిక్రమార్కకు అధికారిక నివాసంగా కేటాయించింది. 
 
మరోవైపు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం భవన అన్వేషణ చేస్తున్నారు. భాగ్యనగరిలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు భద్రతాపరంగా అనుకూలంగా ఉంటుందని, వాహనాల పార్కింగ్‌కు కూడా సౌలభ్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయంగా ఈ భవనాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments