Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన

సెల్వి
శనివారం, 24 ఫిబ్రవరి 2024 (19:49 IST)
తెలంగాణలోని 15 స్టేషన్లు, 50 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలతో కలిపి 550 అమృత్ భారత్ స్టేషన్‌ల నిర్మాణానికి ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వే శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రైల్వే లైన్లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో డబ్లింగ్, ట్రిపుల్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దీంతో పాటు రైల్వే క్రాస్‌ల వద్ద రద్దీని నివారించేందుకు రైల్వే ఫ్లై ఓవర్లు, రైలు అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నారు. 
 
రైళ్లు, రైల్వే లైన్లను విస్తరించడమే కాకుండా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
 
అందులో భాగంగా, భారతీయ రైల్వేలు "అమృత్ భారత్ స్టేషన్లు" అనే కొత్త పథకాన్ని ప్రారంభించాయి.
 
 రెండు వేలకు పైగా రైల్వే స్టేషన్లలో ప్రసారమయ్యే వర్చువల్ ఈవెంట్‌లో వివిధ రాష్ట్రాలలో దాదాపు 1,500 రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments