Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు..

సెల్వి
ఆదివారం, 29 డిశెంబరు 2024 (19:31 IST)
Kavitha
అక్రమ కేసులో అరెస్టయి జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం తొలిసారి నిజామాబాద్‌ పర్యటనకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను... దేనికీ భయపడను అంటూ కవిత తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం.. దమ్ములేక తపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తమని తెలిపారు. 
 
ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది. రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని గుర్తుచేశారు. 
 
పనిలో పనిగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. రైతులు భూములు ఇవ్వకపోయినా రేవంత్‌ రెడ్డి కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారనే విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

Vijay Deverakonda: నా వయసు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా లేను.. విజయ్ దేవరకొండ

Siddu: బ్యాడాస్ లో చుట్టూ కెమెరాలు మధ్యలో సిగార్ తో సిద్ధు జొన్నలగడ్డ లుక్

Samantha: రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించిన సమంత.. ఫోటోలు షేర్ చేసింది.. కన్ఫామ్ చేసిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments