Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు.. ఊడిపడుతున్న భవనం పెచ్చులు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (09:34 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొత్తగా సచివాలయ భవనాన్ని నిర్మించింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్ రావు ఈ సచివాలయ భవనాన్ని నిర్మించారు. అయితే, ఈ భవన నిర్మాణంలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా సచివాలయ భవనంలో పైపెచ్చులు ఊడిపడి ఒక  కారు ధ్వంసమైంది. 
 
సచివాలయ భవనంలోని ఆరో అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడి, పార్కింగ్‌లో ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడ్డాయి. ఈ ఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. పెచ్చులు ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 
 
సచివాలయంలోని ఆరో అంతస్తులోనే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉండటం గమనార్హం. రూ.వందల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం నుంచి పెచ్చులు ఊడిపడటం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments