Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు.. ఊడిపడుతున్న భవనం పెచ్చులు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (09:34 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొత్తగా సచివాలయ భవనాన్ని నిర్మించింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్ రావు ఈ సచివాలయ భవనాన్ని నిర్మించారు. అయితే, ఈ భవన నిర్మాణంలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా సచివాలయ భవనంలో పైపెచ్చులు ఊడిపడి ఒక  కారు ధ్వంసమైంది. 
 
సచివాలయ భవనంలోని ఆరో అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడి, పార్కింగ్‌లో ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడ్డాయి. ఈ ఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. పెచ్చులు ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 
 
సచివాలయంలోని ఆరో అంతస్తులోనే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉండటం గమనార్హం. రూ.వందల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం నుంచి పెచ్చులు ఊడిపడటం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments