ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

ఐవీఆర్
మంగళవారం, 22 జులై 2025 (20:01 IST)
హైదరాబాదులో Bonalu సందర్భంగా మటన్ తెచ్చుకుని తినగా మిగిలినదాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మరుసటి రోజు వేడి చేసుకుని తిన్నారు. అంతే... తిన్న వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఫ్రిజ్‌లో పెట్టిన మాంసాహారం విషపూరితం కావడం వల్లనే ఇలా జరిగినట్లు చెబుతున్నారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. వనస్థలిపురంలో నివాసం వుంటున్న ఆర్టీసి కండక్టర్ శ్రీనివాస్ ఆదివారం నాడు బోనాలు సందర్భంగా మటన్ తెచ్చుకుని తిన్నారు. ఆరోజు వారు తినగా మిగిలినది ఫ్రిజ్‌లో పెట్టుకున్నారు. దాన్ని మంగళవారం బైటకు తీసి పొయ్యి మీద కాస్త వేడి చేసుకుని తిన్నారు. అంతే.. మటన్ తిన్న 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
ఆర్టీసి కండక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారి అతడు మృత్యువాత పడ్డాడు. వారు తిన్న మాంసం విషపూరితం కావడం వల్లనే ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. అందువల్లనే ఒకసారి వండిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టరాదు, అలా పెట్టుకుని తిరిగి వేడి చేసి తింటే అది హానికరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments