హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (08:39 IST)
హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరా నిలిపివేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు అంటే 24 గంటల వరకు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది. 
 
ఈ నిర్ణయం కారణంగా తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలను పరిశీలిస్తే, శాస్త్రీ పురం, బండ్లగూడ, భోజగుట్ట, అల్లబండ, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహెబ్ నగర్, ఆటో నగర్, సైనిక్ పురి, మౌలాలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, స్నేహగిరి, స్నేహగిరి, దేవేంద్ర నగర్, మధుబన్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, కిస్మత్పూర్, గంధం గూడ, బోడుప్పల్, మల్లికార్జున నగర్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ మరియు ధర్మసాయి (శంషాబాద్) ప్రాంతాలు ఉన్నాయి. 
 
అలాగే, హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-3లో 2375 ఎంఎం డయామ్స్ పంపింగ్ మెయిన్‌లో లీకేజీ ఏర్పడిందని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టాలని, ఈ 24 గంటల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా ఉపయోగించాలని జలమండలి కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments