Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్... హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (08:22 IST)
హైదరాబాద్ నగరంలో నీటి వనరుల పరిరక్షణ పేరిట అనేక అక్రమ భవన నిర్మాణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైడ్రా పేరుతో ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేసింది. ఈ సంస్థకు కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ కొనసాగున్నారు. గత కొన్ని రోజులుగా హైడ్రా చర్యలతో హైదరాబాద్ నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారంటూ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కూల్చివేతలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ప్రత్యామ్నాయం చూసుకునే వారకు బాధితులకు సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది. 
 
పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ స్వయంగా తన వాదనలు వినిపించారు. మూసీ బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. అయితే, మూసీ బాధితులకు ఇళ్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నట్టు ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలను కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో హైడ్రా కూల్చివేతలపై బ్లాంకెట్ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం