Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగ్ మాయం... (Video)

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (19:44 IST)
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగు కనిపించకుండా పోయింది. ఈ నగదు బ్యాగును బస్సులో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్లి తిరిగి బస్సులోకి వచ్చి చూడగా ఆ బ్యాగు కనిపించకుండా గుర్తు తెలియని దొంగు ఒకరు ఎత్తుకెళ్లిపోయారు.  
 
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర భోజనాల కోసం ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో రూ.23 లక్షలున్న బ్యాగును వెంకటేష్ అనే ప్రయాణికుడు తీసుకెళుతున్నాడు. 
 
టిఫిన్ చేసేందుకు బస్సును ఆపగా, వెంకటేష్ బ్యాగును బస్సులోనే పెట్టి హోటల్‌కు వెళ్లాడు. అదే అదునుగా చూసి రూ.23 లక్షల బ్యాగును దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. ఆంధ్రప్రదేశ్ - బాపట్లకు చెందిన వెంకటేష్ హైదరాబాద్‌కు వెళ్తుండగా చోరి జరిగింది. నార్కట్ పల్లి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments