Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

సెల్వి
శుక్రవారం, 23 మే 2025 (22:27 IST)
బీఆర్ఎస్ నేత కవిత తెలంగాణలో మరో షర్మిలగా మారే అవకాశం వుందని రాష్ట్రంలో చర్చ జరుగుతోందని బిజెపి ఎంపి రఘునందన రావు అన్నారు. కవిత తన తండ్రి, బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు రాసిన లేఖ మీడియాలో లీక్ అయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ పంచాయితీనా లేక ఆస్తి సంబంధిత పంచాయితీనా లేక కుటుంబ పంచాయితీనా అని ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో వున్నారని రఘునందన రావు అన్నారు. 
 
బీఆర్ఎస్ నేత కవిత మే 2న అమెరికాలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు ఈ లేఖ రాశారు. కానీ తెలంగాణ ప్రజల ఆలోచనలను ప్రతిబింబించే అనేక ప్రశ్నలు లేవనెత్తినందున ఇది విస్తృతంగా చర్చనీయాంశమైంది. అలాగే, బీఆర్ఎస్ ప్లీనరీలో, కేటీఆర్ తన రాజకీయ వారసురాలు అవుతారని కేసీఆర్ స్పష్టంగా సూచించారు. 
 
ఈ నేపథ్యంలో కవిత కాంగ్రెస్ గూటిలోకి వెళ్లవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ లేఖ వెనుక సీఎం హరీష్ రావు ఉన్నారా అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇంతలో, కేటీఆర్, హరీష్ రావు తాము ఒకటేనని చూపించుకోవడానికి కలిశారని రఘునందన్ రావు ఒక సోషల్ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. 
 
ఇక బీజేపీ విషయానికి వస్తే.. ప్రజలు తెలంగాణలో తదుపరి ఎంపికగా బీజేపీ వైపు చూస్తున్నారని రఘునందన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments