Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

సెల్వి
శుక్రవారం, 23 మే 2025 (22:27 IST)
బీఆర్ఎస్ నేత కవిత తెలంగాణలో మరో షర్మిలగా మారే అవకాశం వుందని రాష్ట్రంలో చర్చ జరుగుతోందని బిజెపి ఎంపి రఘునందన రావు అన్నారు. కవిత తన తండ్రి, బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు రాసిన లేఖ మీడియాలో లీక్ అయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ పంచాయితీనా లేక ఆస్తి సంబంధిత పంచాయితీనా లేక కుటుంబ పంచాయితీనా అని ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో వున్నారని రఘునందన రావు అన్నారు. 
 
బీఆర్ఎస్ నేత కవిత మే 2న అమెరికాలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు ఈ లేఖ రాశారు. కానీ తెలంగాణ ప్రజల ఆలోచనలను ప్రతిబింబించే అనేక ప్రశ్నలు లేవనెత్తినందున ఇది విస్తృతంగా చర్చనీయాంశమైంది. అలాగే, బీఆర్ఎస్ ప్లీనరీలో, కేటీఆర్ తన రాజకీయ వారసురాలు అవుతారని కేసీఆర్ స్పష్టంగా సూచించారు. 
 
ఈ నేపథ్యంలో కవిత కాంగ్రెస్ గూటిలోకి వెళ్లవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ లేఖ వెనుక సీఎం హరీష్ రావు ఉన్నారా అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇంతలో, కేటీఆర్, హరీష్ రావు తాము ఒకటేనని చూపించుకోవడానికి కలిశారని రఘునందన్ రావు ఒక సోషల్ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. 
 
ఇక బీజేపీ విషయానికి వస్తే.. ప్రజలు తెలంగాణలో తదుపరి ఎంపికగా బీజేపీ వైపు చూస్తున్నారని రఘునందన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments