Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత ప్రయాణం-బస్సుల సంఖ్య పెంచరా? కన్నీళ్లు పెట్టుకున్న యువతి!?

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (22:21 IST)
Students
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్ రాష్ట్ర జీడీపీని పెంచడమే కాకుండా రాష్ట్రంలో ప్రశాంతమైన, సురక్షితమైన, సమర్థవంతమైన ఆర్టీసీ ప్రయాణాన్ని ఎలా అందించగలుగుతున్నాయో, దానికి ప్రజలనుండి వస్తున్న అద్భుతం ఇదంటూ.. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. అధికారం కోసం పనికిరాని హామీలు ఇచ్చి నిరుపేద విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఉచిత ప్రయాణం కోసం మహిళల సంఖ్య పెరగడంతో బస్సులు నిండిపోతున్నాయి. దీంతో విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి బస్సు టాప్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాకుండా బస్సు వెనక గల మెట్లపై విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. దీన్ని చూసి నెటిజన్లు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనేమోనని సెటైర్లు వేస్తున్నారు. 
 
అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. బస్సులు లేక అవస్థలు మహిళలు, కళాశాల విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు.  
Jagtial Bus full
 
సమయానికి బస్సులు లేక ప్రమాదకర స్థితిలో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సులు లేవని కళాశాల విద్యార్థిని రోధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే విద్యార్థులు ప్రమాదకరమైన స్థితిలో ప్రయాణిస్తున్నారు. 
 
దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఎంత కష్టమొచ్చిందోనని... స్కీమ్ ప్రవేశపెట్టే ముందు బస్సుల సంఖ్య కూడా పెంచాలి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments