Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు బైబై.. నాలుగు రోజుల పాటు వర్షాలు

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:33 IST)
భానుడి భగభగలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. వేడి సెగలకు తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో రెండు తెలుగు రాష్రాలకు ఆయా వాతావరణ శాఖలు చల్లని కబురు అందించాయి. మరో నాలుగు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుందని, అలానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలుగు ప్రజలు వర్షాలు రాబోతున్నాయా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పగా…తాజాగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం, అలానే 10,11వ తేదీల్లో వాతావరణం చల్లబడుతుందని ఐఎండీఏ చెప్పింది.
 
ఏపీలో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments