ఆమ్రపాలికి షాకిచ్చిన కేంద్రం : ఏపీకి వెళ్లాలంటూ ఆదేశం

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (23:01 IST)
గ్రేటర్ హైదరాబాద్ మన్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి కాటాకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. తక్షణం సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. అయితే, తమను తెలంగాణాలోనే కొనసాగించాలని ఆమెతో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులు చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. 
 
తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి కీలకంగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గానేకాకుండా పలు కీలక బాధ్యతలను ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అలాగే, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్ కూడా విద్యుత్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
 
అయితే, ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్,, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులు ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి వీరితో పాటు మొత్తం 11 మంది అధికారులు తెలంగాణ కేడర్ కావాలంటూ కేంద్రాన్ని కోరారు. 
 
కానీ, వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అధికారులు అందరూ సొంత రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల పేరుతో లేఖను రాస్తూ వాటి కాపీలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments