Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో కూల్చివేతలు ప్రారంభం.. భారీగా పోలీసుల మొహరింపు

ఠాగూర్
ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (10:44 IST)
హైదరాబాద్ నగరంలో నీటి వనరులను ఆక్రమించుకుని అక్రమంగా నిర్మించుకున్న భవనాలను హైడ్రా కూల్చివేస్తుంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఈ కూల్చివేతలు సాగుతూవచ్చాయి. అయితే, ఆదివారం కూకట్‌పల్లిలో మొదలుపెట్టారు. 27 ఎకరాల్లో విస్తరించిన కూకట్‌పల్లి చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైంది. దీంతో ఇక్కడ కూల్చివేతలను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీగా పోలీసులను మొహరించారు. 
 
చెరువులోని ఎఫ్.టి.ఎల్, బఫర్‌జోన్‌లో ఏడు ఎకరాల ఆక్రమణలకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్‌జోన్‌లోని నాలుగు ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లను నిర్మించారు. అలాగే ఎఫ్.టి.ఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. హైడ్రా ముందే చెప్పినట్టుగా నివాసం ఉంటున్న భవనాలను కాకుండా ఖాళీగా ఉన్న షెడ్లను కూల్చివేస్తున్నారు. నివాసం ఉంటున్న గృహాలను నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వాటిని కూల్చివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments