Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ మహిళా అభ్యర్థిని ఆలింగనం చేసుకుని సస్పెండైన ఏఎస్ఐ

వరుణ్
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (08:45 IST)
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విరించి ఆస్పత్రి యజమాని భార్య మాధవీలత పోటీ చేస్తున్నారు. గెలుపు కోసం ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచారసమయంలో భద్రతా విధుల్లో ఉన్న ఒక ఏఎస్ఐ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె పేరు ఉమాదేవి. సైదాపబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 
 
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలత తన నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో సైదాబాద్‌ ఏఎస్ఐ ఉమాదేవి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీడియో ఉన్నదాని ప్రకారం ఏఎస్ఐ మాధవీలతకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత హగ్ చేసుకున్నారు. కాగా ఈ స్థానం నుంచి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments