Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

సెల్వి
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (18:21 IST)
సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌లో ఎక్కువైపోతున్నారు. నగరానికి చెందిన ఓ వృద్ధ జంటను రూ.10.61 కోట్ల మేర మోసం చేశారు. వివరాల్లోకి వెళితే.. మోసగాళ్లు వృద్ధుడిని వాట్సాప్ ద్వారా సంప్రదించారని, అతని పేరు మీద ముంబైలో బ్యాంక్ ఖాతా తెరిచినట్లు చెప్పారు. 
 
ఇక, జూలై 8న మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ, నకిలీ మెసేజ్ లు పంపడంతో పాటు ఆ జంటను భయపెట్టే వ్యూహాలను ఉపయోగించారు. ఇక ఆ మనీలాండరింగ్ కేసు నుండి అతని పేరును క్లియర్ చేయడానికి వారి ఆదేశాలను అనుసరించమని స్కామర్లు బాధితుడికి సూచించారు. 
 
ఇక భయంతో వణికిపోయిన ఆ జంట స్కామర్ల వలలో చిక్కుకున్నారు. నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లో నిధులు తిరిగి వస్తాయని పేర్కొంటూ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేయమని వారు ఒప్పించారు. 
 
ఈ క్రమంలో ఆ వృద్ధ జంటను జులై 8 నుంచి 26వ తేదీ వరకు 11 వాయిదాల్లో మొత్తం రూ.10.61 కోట్లను మోసం చేశారు. ఆపై మోసపోయామని తెలుసుకున్న ఆ జంట సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments