Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

సెల్వి
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (18:21 IST)
సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌లో ఎక్కువైపోతున్నారు. నగరానికి చెందిన ఓ వృద్ధ జంటను రూ.10.61 కోట్ల మేర మోసం చేశారు. వివరాల్లోకి వెళితే.. మోసగాళ్లు వృద్ధుడిని వాట్సాప్ ద్వారా సంప్రదించారని, అతని పేరు మీద ముంబైలో బ్యాంక్ ఖాతా తెరిచినట్లు చెప్పారు. 
 
ఇక, జూలై 8న మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ, నకిలీ మెసేజ్ లు పంపడంతో పాటు ఆ జంటను భయపెట్టే వ్యూహాలను ఉపయోగించారు. ఇక ఆ మనీలాండరింగ్ కేసు నుండి అతని పేరును క్లియర్ చేయడానికి వారి ఆదేశాలను అనుసరించమని స్కామర్లు బాధితుడికి సూచించారు. 
 
ఇక భయంతో వణికిపోయిన ఆ జంట స్కామర్ల వలలో చిక్కుకున్నారు. నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లో నిధులు తిరిగి వస్తాయని పేర్కొంటూ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేయమని వారు ఒప్పించారు. 
 
ఈ క్రమంలో ఆ వృద్ధ జంటను జులై 8 నుంచి 26వ తేదీ వరకు 11 వాయిదాల్లో మొత్తం రూ.10.61 కోట్లను మోసం చేశారు. ఆపై మోసపోయామని తెలుసుకున్న ఆ జంట సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments