Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

ఠాగూర్
గురువారం, 10 జులై 2025 (13:01 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్రశ్నించింది. పైగా, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు.. నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తికి వ్యక్తిగత హోదాలో నోటీసుల జారీచేసింది. 
 
ప్రముఖ నటి శిల్పా చక్రవర్తికి చెందిన 32 ఎకరాల భూవివాదంపై సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఉన్నా పోలీసులు జోక్యం చేసుకోవడంపై వివరణ కోరింది. నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ స్సై రామ్మూర్తికి వ్యక్తిగత హోదాలో నోటీసు జారీ చేసింది. నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలో కొనుగోలు చేసిన 32 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో పోలీసుల జోక్యాన్ని సవాల్ చేస్తూ జడ కల్యాణ్ యాకయ్య, అతని భార్య టీవీ నటి శిల్పాచక్రవర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు.
 
పిటిషనర్ తరపు న్యాయవాది లక్ష్మీకాంత్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు 2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ నుంచి కొంత భూమి కొనుగోలు చేశారని, 2019లో తనఖా డీడ్ మరికొంత భూమిపై హక్కులను పొందారన్నారు. 2017లో సివిల్ కోర్టును ఆశ్రయించి ఇంజంక్షన్ ఉత్తర్వులతోపాటు పోలీసు రక్షణ ఉత్తర్వులను పొందారన్నారు. 
 
అయితే మహమ్మద్ అబ్దుల్ అజీజ్ కుమ్మక్కైన పోలీసులు పిటిషనర్లను వేధిస్తున్నారని, భూవివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ ఎస్ఐ ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. వాదనలను ఆలకించిన న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments