Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖానాపూర్‌లో నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపేశారు...

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (15:58 IST)
తెలంగాణా రాష్ట్రంలో దారుణం జరిగింది. నిర్మల్ జిల్లాలో నడి రోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఓ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారుణం జిల్లాలని ఖానాపూర్ పరిధి శివాజీ నగర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు. ఖానాపూర్‌ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన సీహెచ్ సోనీ అలియాస్‌ స్వీటీ (20).. టైలరింగ్‌ షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలుడి తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ మోహన్‌, ఎస్‌ఐ లింబాద్రి పరిశీలించారు. యువతిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments