Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (12:23 IST)
తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్త స్పీకర్ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ వెల్లడించారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆ తర్వాత గడ్డం ప్రసాద్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి కేటీఆర్‌ను తదితరులు తోడ్కోని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సభాపతి స్థానం వరకు తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన చైర్ వద్దకు వెళ్ళి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభ కొనసాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments