Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు జలసమాధి (Video)

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (08:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు చెరువులో మునిగిపోవడంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా, పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంతో వెళుతున్న కారు నియంత్రణ కోల్పోయి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు చెరువులోని నీటిలో మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు జలసమాధి అయ్యారు. ఒకరు మాత్రం చెరువు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను వెలికి తీసి, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్‌కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీలుగా గుర్తించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments