Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు జలసమాధి (Video)

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (08:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు చెరువులో మునిగిపోవడంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా, పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంతో వెళుతున్న కారు నియంత్రణ కోల్పోయి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు చెరువులోని నీటిలో మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు జలసమాధి అయ్యారు. ఒకరు మాత్రం చెరువు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను వెలికి తీసి, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్‌కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీలుగా గుర్తించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments