Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

సెల్వి
శనివారం, 18 మే 2024 (14:02 IST)
వివాహేతర సంబంధం భర్తను బలిగొంది. పక్కా ప్లాన్ ప్రకారం భార్య భర్తను హతమార్చింది. ఈ కేసులో శుక్రవారం నిందితులు మృతుడి భార్య శ్రీలక్ష్మి, ఆమె ప్రియుడు రాజేశ్, రౌడీ షీటర్ రాజేశ్వర్ రెడ్డి, మహ్మద్ మైతాబ్‌ను పోలీసులు అరస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డి గూడకు చెందిన విజయ్ కుమార్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. 15 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మితో అతనికి వివాహం జరిగింది. వీరు ఇద్దరు పిల్లలతో కలిసి జయప్రకాశ్ నగర్ అపార్ట్ మెంట్‌లో వుంటున్నారు. 
 
పెళ్లికి ముందే ప్రేమించిన రాజేశ్‌తో శ్రీలక్ష్మి సంబంధాన్ని కొనసాగింది. గంటల తరబడి ఫోనులో మాట్లాడేది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి.. భర్త ఆమె చేసిన తప్పును కనిపెట్టాడు. ఈ విషయంపై భార్యాభర్తలిద్దరికి గొడవ జరిగేది. దీంతో భర్తను మట్టుబెట్టాలని భావించింది. 
 
ప్రియుడి సాయంతో రౌడీషీటర్‌ రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దించింది. పక్కా ప్లాన్ ప్రకారం శ్రీలక్ష్మి ఇంట్లోనే ఆమె భర్తను చంపేశారు. అయితే విజయ్ కుమార్ గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. 
 
అయితే రౌడీ షీటర్ పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో అసలు సంగతి బయటికి వచ్చేసింది. దీంతో శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్లడంతో తల్లిదండ్రులు లేని ఆ చిన్నారులు అమ్మమ్మ ఇంటికి చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments