హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:59 IST)
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల సౌకర్యార్థం అర్థరాత్రి 12 గంటల వరకు సేవలు అందించాలని మెట్రో నిర్ణయించింది. సోమవారం నుంచి కొత్త వేళలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత నష్టాల్లో నడుస్తున్న మెట్రో దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతి రోజూ సగటున 5 లక్షలు మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 7 లక్షలకు చేర్చాలనేది మెట్రో లక్ష్యం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ప్రయాణికులు కూడా మెట్రో సేవలను పొడగించాలని ఎప్పటి నుంచే కోరుతున్నారు. వారి డిమాండ్ ఇన్నాళ్ళకు నెరవేరింది. రైళ్ల రాకపోకలకు, ట్రాక్ నిర్వహణకు సమయం చాలాదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు రైళ్ల వేళల పెంపు విషయంలో మెట్రో తాత్సారం చేసింది. 
 
తాజాగా నిన్నటి నుంచి వేళలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్థరాత్రి విధులు ముగించుకునే ఉద్యోగులకు, దూర ప్రయాణాలు చేసి రాత్రివేళ నగరానికి చేరుకునే వారికి మెట్రో నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. మరోవైపు, నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు చార్జీలను పెంచాలని మెట్రో ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments