Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:59 IST)
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల సౌకర్యార్థం అర్థరాత్రి 12 గంటల వరకు సేవలు అందించాలని మెట్రో నిర్ణయించింది. సోమవారం నుంచి కొత్త వేళలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత నష్టాల్లో నడుస్తున్న మెట్రో దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతి రోజూ సగటున 5 లక్షలు మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 7 లక్షలకు చేర్చాలనేది మెట్రో లక్ష్యం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ప్రయాణికులు కూడా మెట్రో సేవలను పొడగించాలని ఎప్పటి నుంచే కోరుతున్నారు. వారి డిమాండ్ ఇన్నాళ్ళకు నెరవేరింది. రైళ్ల రాకపోకలకు, ట్రాక్ నిర్వహణకు సమయం చాలాదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు రైళ్ల వేళల పెంపు విషయంలో మెట్రో తాత్సారం చేసింది. 
 
తాజాగా నిన్నటి నుంచి వేళలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్థరాత్రి విధులు ముగించుకునే ఉద్యోగులకు, దూర ప్రయాణాలు చేసి రాత్రివేళ నగరానికి చేరుకునే వారికి మెట్రో నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. మరోవైపు, నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు చార్జీలను పెంచాలని మెట్రో ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments