Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలతో బాధపడుతున్న ఆంధ్ర ప్రజలను ఆదుకోవాలని మీకు లేదా? ఆంధ్రకు ఆమ్రపాలి?

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (18:55 IST)
కర్టెసి-ట్విట్టర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లం మొర్రో అంటున్నారు ఆ ఐఏఎస్ అధికారులు. ఈ నెల 9వ తేదీన కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి తాము తెలంగాణ రాష్ట్రంలోనే వుండేట్లు చూడాలంటూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రోనాల్డ్ రాస్, సృజనలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) ను ఆశ్రయించారు. ఐతే వారి పిటీషన్లు విచారించిన క్యాట్ వారి ముందు ఆలోచింపజేసే వ్యాఖ్యలను చేసింది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వరుస వర్షాలతో వరదలు వచ్చి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి వారికి తగిన సేవ చేయాలని మీకు లేదా అంటూ ప్రశ్నించింది. ఐఏఎస్ ల కేటాయింపులపై డీవోపీటికి పూర్తి అధికారాలు వున్నాయనీ, స్థానికత అనే అంశం వున్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం నిబంధనలలో వున్నాయా అంటూ ప్రశ్నించింది.
 
కేంద్రం ఆదేశించినట్లుగానే జాబితాలో వున్న ఐఏఎస్ అధికారులు అందరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. దీనితో పలువురు అధికారులు ఇప్పటికే ఏపీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలలో సైతం సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఆమె ఏపికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments