Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎటూ కాకుండా ఇరుక్కున్న చిలిపి రాజయ్య!

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (10:59 IST)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో చక్రం తిప్పిన టి.రాజయ్య ఇపుడు ఎటూ కాకుండాపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. కానీ, ఢిల్లీలో రాజయ్యను కాంగ్రెస్ పెద్దలు కలవడానికి మొహం చాటేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించిన స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు హస్తం నేతలు హ్యాండిస్తున్నారు. 
 
సొంత నియోజకవర్గంలోని మహిళలు శనివారం నాడు పెద్ద ఎత్తున గాంధీ భవన్‌కు చేరుకుని రాజయ్యను పార్టీలో చేర్చుకుంటే చెప్పులతో కొడతాం అంటూ ధర్నా చేశారు. రాజయ్య చేరికకు మొదట్లో ఓకే చెప్పిన రేవంత్ రెడ్డి.. సొంత పార్టీలో వస్తున్న నిరసనల నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. 10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మీడియాకు లీకులు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళిన రాజయ్యకు ఢిల్లీ పెద్దలు మొహం చాటేశారు. తన నేపథ్యం, బలాల గురించి వివరిస్తూ 30 లేఖ రాసి మల్లిఖార్జున్ ఖర్గేకు పంపినా ఆయన అపాయిట్మెంట్ ఇవ్వకపోగా కేసీ వేణుగోపాల్ సైతం అదే బాటలో మొహం చాటేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments