తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నటి విజయశాంతి ప్రశంసలు

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (12:32 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నటి విజయశాంతి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన తర్వాత శాసనసభ సమావేశాలు తొలిసారి విధానపరంగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం ఎంతో ఆనందదాయకమన్నారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర మూడో అసెంబ్లీ సమావేశాలు ఇటీవల ప్రారంభమై సజావుగా సాగుతున్నాయి. దీనిపై విజయశాంతి స్పందిస్తూ, 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా, హుందాగా జరుగుతుండటం ఇదే తొలిసారన్నారు. సచివాలయం కూడా ఇపుడు పూర్తి స్థాయిలో పని చేస్తుందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో దాదాపు దశాబ్దం తర్వాత ప్రజాస్వామ్య పంథాలో పనిచేస్తుందని పేర్కొన్నారు
 
ఇది ప్రజా ప్రభుత్వమన్నారు. అందువల్ల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రజాస్వామ్య పంథాలోనే నడుస్తుందని, కోట్లాడి మందికి ఇపుడిపుడే విశ్వాసం ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా 26 యేళ్ల పోరాటం తర్వాత మీ రాములమ్మ ఇపుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే.. తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్ ఎప్పటికీ బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోలుకుంటానని విజయశాంతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments