15 లక్షల కుటుంబాలకే రూ.500కే వంట గ్యాస్ కనెక్షన్లు!!

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో గృహలక్ష్మిపథకం కింద రూ.500కే వంట గ్యాస్ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందులోభాగంగా, 15 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది. అలాగే, 200 లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో అర్హుల ఎంపికపై అధికారులు దృష్టిసారించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోగానే ఈ రెండింటిని అమలు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 40 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 17.20 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆహారభద్రతా కార్డులున్నాయి. గతంలో వీటినే తెల్లకార్డుగా వ్యవహరించేవారు. ఈ కార్డుదారుల్లో 15 లక్షలమందికే వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా.. వీరికే రూ.500కు సిలిండర్ లభించనుంది. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు 17.20 లక్షల మందికి దక్కే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 
 
మరో పది రోజుల్లో ఖచ్చితమైన లెక్కలు వచ్చే అవకాశముందన్నారు. ఉచిత కరెంటుకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో సీజీఎంలు, ఎస్ఈలు బుధవారం పరిశీలించారు. మెట్రోజోన్ సీజీఎం కె.నర్సింహస్వామి అంబేద్కర్ బస్తీలో, ఆర్ఆర్‌జోన్ సీజీఎం యాచారం, సీజీఎం సాయిబాబా మేడ్చల్ పరిధిలో ప్రక్రియలో పాల్గొని పర్యవేక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments