Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:19 IST)
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భద్రతా కారణాల రీత్యా మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు. అదనంగా, పొరుగు దేశంలోని వివిధ ప్రాంతాలలో 650,000 మంది భద్రతా బలగాలను మోహరించారు. 
 
గురువారం నాడు, దాదాపు 13 కోట్ల మంది పాకిస్థానీయులు తమ దేశంలోని తదుపరి ప్రభుత్వానికి, అలాగే దేశంలోని నాలుగు ప్రావిన్సుల శాసనసభల కోసం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కటకటాల వెనుక ఉన్నందున ఈసారి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుందని అంచనా. ఇక గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇది సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. 
 
ఓటింగ్ గంటలను పొడిగించే అధికారం అధికారులకు ఉంటుంది. ఓటింగ్ ముగిసిన కొద్దిసేపటికే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కొన్ని గంటల్లో ప్రాథమిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 
 
పాకిస్తానీ రాజకీయాలు ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP)ల మధ్య పోటీ జరుగుతోంది. 
మొత్తంగా నలభై నాలుగు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments