భార్య, ఇద్దరు పిల్లలను కాల్చాడు.. కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (14:27 IST)
Gunman
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కలెక్టర్‌ గన్‌మెన్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆకుల నరేష్‌ అనే కానిస్టేబుల్‌ కలెక్టర్‌ గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేష్ తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కూతురు హిమశ్రీలను తుపాకీతో కాల్చాడు. 
 
అనంతరం కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 
 
 
అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. గొడవ తీవ్రరూపం దాల్చడంతో కోపంతో నరేష్ పాఠశాలకు వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. ముందుగా భార్యను తుపాకీతో కాల్చి, పిల్లలను కూడా కాల్చాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments