Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాయం

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (18:29 IST)
MBBS student
తెలంగాణలో కొమరం భీమ్ జిల్లా జైనూర్ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆర్థిక సాయం అందించారు. సాయిశ్రద్ధకు ఎంబీబీఎస్ సీటు రావడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కాలేజీ ఫీజు చెల్లించలేదు. 
 
ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి డాక్టర్ కావాలనే ఆ బాలిక కలను నెరవేర్చే బాధ్యతను ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం అందించారు. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103వ ర్యాంకు సాధించింది. 

ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఓ యువతి వైద్యురాలు కావాలనే ఆశయంతో ఎంతో కష్టపడి చదివింది. చివరికి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం వచ్చింది. తన లక్ష్యానికి చేరుకునేందుకు ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడకు చెందిన మెస్రం జ్ఞానేశ్వర్, లక్ష్మి దంపతులకు శుభం, సాయి శ్రద్ధ ఇద్దరు సంతానం. జ్ఞానేశ్వర్ టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని కొడుకు, కూతురిని చదివిస్తున్నారు. కొడుకు శుభం బీటెక్ చదివి గేట్ పరీక్షకు సిద్ధం అవుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments