Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (09:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ అధికారులను అడుక్కోవడం ఏమిటని తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్నారు. తిరుమలకు వెళ్లే బదులు మన రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించాలని ఆయన సూచించారు. 
 
తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిసారీ ఏపీ ప్రభుత్వాన్ని, తితిదే అధికారులను అడుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మనకు యాదగిరి గుట్ట దేవస్థానం ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా? మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా? అని ప్రశ్నించారు. 
 
తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణాలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇపుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మెక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే మన రాష్ట్రానికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments