Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముహూర్తానికి ముందు డబ్బు నగలతో పారిపోయిన వరుడు.. ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (14:29 IST)
వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. తమతమ కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, వరుడు తనలోని వంకర బుద్ధిని చివరి నిమిషంలో బయటపెట్టాడు. ముహూర్తానికి కొన్ని గంటల ముందు డబ్బు, నగలతో పారిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని మారేడ్‌పల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మారేడ్‌పల్లికి చెందిన సందీప్ రమేశ్ ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి ప్రేమ కథకు తల్లిద్రండులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరూ మేజర్లే.. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయినా తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టంలేక అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కష్టపడి పెద్దవాళ్లను ఒప్పించారు. 
 
ఈ నెల 8న (శుక్రవారం) వారిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ప్రేమ వివాహమే అయినా కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.10 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లలో ఇరుకుటుంబాలు తలమునకలుగా ఉండగా... గురువారం నాడు సందీప్ రమేశ్ అందరికీ షాకిచ్చాడు. డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయాడు. విషయం తెలిసిన పెళ్లికూతురు నివ్వెరపోయింది. ఈ ఘటనకు సంబంధించి పెళ్లికూతురు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న వరుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments