Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీ రావు మరణం జాతికి తీరని లోటు: అసోచామ్ ఏపీ- తెలంగాణ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ కె రవికుమార్ రెడ్డి

ఐవీఆర్
శనివారం, 8 జూన్ 2024 (17:39 IST)
మీడియా రంగంలో తిరుగులేని వ్యక్తి, తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాటంలో చురుకైన కార్యకర్త అయిన శ్రీ చెరుకూరి రామోజీ రావు ఆకస్మిక మరణం చాలా బాధాకరం అని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)  ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ కటారు రవికుమార్ రెడ్డి తెలిపారు. 
 
భారతీయ వ్యాపారవేత్త, మీడియా వ్యవస్థాపకుడు- చలనచిత్ర నిర్మాత, చెరుకూరి రామోజీ రావు ఓ మహోన్నత వ్యక్తి. రామోజీ గ్రూప్ అధినేతగా, ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ టీవీ నెట్‌వర్క్, ఉషా కిరణ్ మూవీస్‌ సంస్థలను కలిగి ఉండటంతో పాటు పద్మ విభూషణ్, జాతీయ చలనచిత్ర అవార్డులను కలిగి ఉన్నారు. అతని అంకితభావం, వృత్తి నైపుణ్యం, వినయాన్ని నేను అభినందిస్తున్నాను, ప్రత్రికలలో తప్పుడు సమాచారం లేకుండా చేయటంతో పాటుగా ప్రత్రికా స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా ఆయన పనిచేశారు.
 
‘తెలుగు వెలుగు’ చెరుకూరి రామోజీ రావు మరణం జాతికి తీరని లోటు. ఆయన అంకితభావం, ఆవిష్కరణ జర్నలిజం, మీడియా రంగాలపై చెరగని ముద్ర వేసింది. అసోచామ్‌ బృందం చెరుకూరి రామోజీ రావుకు నివాళులర్పిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహోద్యోగులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments