Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (09:13 IST)
హైదరాబాద్ నగరంలో తిరిగే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కదిలే రైలు నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆమె గాయాలయ్యాయి. గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడిపోయిన ఆ యువతి అటుగా వెళుతున్న పాదాచారుడు గుర్తించి 108కు ఫోన్ చేసి సమాచారం చేరవేశాడు. దీంతో సిబ్బంది అక్కడకు వచ్చి ఆ యువతిని రక్షించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతిగా గుర్తించారు. 
 
ఈ యువతి మేడ్చల్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తుకుంటూ జీవిస్తుంది. ఈ క్రమలో సికింద్రాబాద్‌లో తన మొబైల్ ఫోనును రిపేర్ చేయించుకుని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళుతుండగా ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మహిళల బోగీలోకి ప్రవేశించిన ఓ అగంతకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి చెక్డ్ షర్డ్ ధరించి నల్లగా, సన్నగా ఉన్నాడని, సుమారు 25 యేళ్ల వయసు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వివరాల్లో పేర్కొంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారని సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ రెడ్డి తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments